కీలక నేతల మధ్య విభేదాలు.. దృష్టి సారించిన BJP |


18 Jul 2026 | 16:27 IST

కీలక నేతల మధ్య విభేదాలు.. దృష్టి సారించిన BJP

హైదరాబాద్‌: భాజపాలో కీలక నేతల మధ్య విభేదాలపై అధిష్ఠానం దృష్టి సారించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌, ఎంపీ ఈటల రాజేందర్‌తో భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ అభయ్‌ పాటిల్ భేటీ అయ్యారు. ఎంపీ లక్ష్మణ్‌ నివాసంలో ఇరువురు నేతలతో గంట పాటు సమావేశం జరిగింది. పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని వారికి సూచించారు. ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి రావడంపై భేటీలో చర్చించామన్నారు. ప్రజలకు కాంగ్రెస్‌పై కోపం ఉందని, బీఆర్‌ఎస్‌పై నమ్మకం లేదని తెలిపారు.



Source link

Scroll to Top